![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgW4A0JEQD3ma9QpYKHXrMJ5AOZ1vR0bPW4fbrej2YSLRaCx02VMBwK40ModdLHNSPyTRQMJuLA7LnhBXmbyG65rDh_-iJnyZJeTFDvH4n56OjoaR_BbSWHAj4d-8CY1BowE2Se008GmH4M/s320-rw/IMG-20211103-WA0129-726490.jpg)
తునిలో ... శ్రీ చక్క శ్రీరామ్మూర్తి స్మారక పురపాలక ఉన్నత పాఠశాల, బ్యాంక్ కాలనీ నందు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న *
శ్రీ ఈరంకి వీర వెంకట సత్య వర ప్రసాద్* గారు తెలుగు సాహిత్యం పై అభిరుచితో పద్య కవిత్వం, వచన కవిత్వం రాస్తూ.. శ్రీ జాదవ్ పుండలిక్ రావు గారు రూపొందించిన *
చిమ్నీలు* నూతన తెలుగు కవితా ప్రక్రియలో శతాధిక గేయ కవితలు లిఖించినందుకుగాను శ్రీ హంస వాహినీ సాహిత్య కళాపీఠం, భైంసా, నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారు *
వెలుగు దివ్వె* పురస్కారం వర ప్రసాద్ గారికి వాట్సాప్ గ్రూపు ద్వారా అందజేశారు. అవార్డు గ్రహీత ఈరంకి వర ప్రసాద్ గారిని తోటి ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు శ్రేయోభిలాషులందరూ అభినందించారు.