సర్వేపల్లి

సర్వేపల్లి

నేడే సర్వేపల్లి జయంతి.సర్వేపల్లి జీవిత విశేషాలు తెలియచేసిన ఉమాశేషారావు వైద్య
అది మైసూర్ నగరం. ఒక ఉపాధ్యాయుని ఇల్లు.ఆరోజు ఆ ఉపాధ్యాయుడు మైసూర్ విశ్వవిద్యాలయం నుండి  శ్రీ అశుతోష్ముఖర్జీకోరికపై,కలకత్తా విశ్వవిద్యాలయంలోపనిచేయడానికివెడుతున్నారు.స్వయంగా మైసూర్ మహరాజు పంపిన సార్ట్బండిఆయనకోసంసిద్ధంగా ఉంది. ఆయన వచ్చి బండీలోకూర్చోగానేజరిగిందిఆసంఘటనకొంతమంది విద్యార్థులు వచ్చి బండికి కట్టిన గుఱ్ఱాలను తీసి వేశారు. బండి కాడిని తమ భుజాలపైన వేసుకుని ఆ ఉపాధ్యాయుని మైసూర్ రైల్వే స్టేషన్ వరకూ ఆ గురువును ఊరేగింపుగా తీసుకు వెళ్ళారు. బహుశః ఆధునిక ప్రపంచంలో అంతటి గౌరవం పొందిన తొలి ఉపాధ్యాయుడు ఆయనే అయిఉండవచ్చు. ఆ రోజున ఈ సత్కారాన్ని పొందిన ఉపాధ్యాయుడు డా.సర్వేపల్లి రాథాకృష్ణన్. ఈ సత్కారాన్ని నిర్వహించిన విద్యార్థి బృందం నాయకుడు ఆతర్వాత రోజుల్లో కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా, మరియు అఖిలభారతకాంగ్రెస్అధ్యక్షునిగా చేశాడు. ఆయన పేరు ఎస్.నిజలింగప్ప. ఇది 1921 నాటిసంఘటన.ఆంధ్రాయూనివర్సిటీ, బనారస్యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ లకు వైస్ ఛాన్సలర్చేసినఘనతఆయనొక్కరిదే.ఒకసారి కొంతమంది మిత్రులుఆయనతోసంభాషిస్తూ, 'మీలాంటి వారు ఆక్స్ ఫర్డ్,కేంబ్రిడ్జివంటియూనివర్సిటీ లలో విద్యాభ్యాసం చేసి ఉంటే మీపేరుమరింతగాపరిమళించేది!'అన్నారట.అందుకుసమాధానమిస్తూ, "నేను ఆ యూనివర్సటీలకు విద్యార్థిగా కాదు. ఒక గురువుగా మాత్రమే వెళతాను" అని అన్నారు. అదేవిధంగా 1937 నుండి'57 దాకా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ విజిటంగ్ ప్రొఫెసర్ పనిచేశారు.
హైస్కూల్ విద్య పూర్తిచేసుకుని కళాశాలలోచేరేటప్పుడుఫీజుల కోసం తన బంధువులలో ఒకరినిసహాయంఅడుగుదామని బయల్దేరిన రాథాకృష్ణన్ గారికి ఆ బంధువు మద్రాస్ స్టేషన్ లోనే ఎదురై తనదగ్గర సొమ్ము లేదని, పుస్తకాలు మాత్రం తనవి ఇవ్వగలనని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో చదువుకున్నారాయన.బనారస్ హిందూ యూనివర్సిటీ లో వైస్ ఛాన్సలర్చేస్తున్నకాలంలో ప్రతిరోజూఒక్కోఅంశంపైవిద్యార్థులకు ఉపన్యాసాలు చెప్పేవారు. ఆ గోడల దగ్గరకు వెడితేఆఉపన్యాసాలుఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనేఉంటాయి.హిందూ ధర్మం లోని విశేషాలను అత్యంత సూక్ష్మంగా పశ్చిమ దేశాలకు వివరించి చెప్పిన మనకాలపు వివేకానందుడు శ్రీ సర్వేపల్లి రాథాకృష్ణన్ఆంధ్ర విశ్వకళా పరిషత్నుఅత్యున్నత స్థాయికితీసుకువెళ్ళినమహనీయుడు ఆయనఅక్కడివిద్యార్థి వసతిగృహాలకు"నాగార్జున,సిద్దార్థ,శాతవాహన"వంటి పేర్లు ఆయనపెట్టినవేరష్యాకుభారత రాయబారిగా వెళ్ళి , అత్యంత మొండి వానిగా పేరొందిన జోసె ఫ్ స్టాలిన్ ను ఆత్మీయంగా పల కరించిన ఔద్ధత్యం డా.సర్వేపల్లి రాథాకృష్ణన్ది.నన్నుప్రపంచమంతా ఒక నాయకునిగా మాత్రమే చూసింది. కాని నాలోని మని షిని నాకు చూపించిన మహ నీయుడు రాథాకృష్ణన్!" అని స్టాలిన్ చెప్పారు.స్వతంత్ర భారతావనికి తొలి ఉపరాష్ట్ర పతి గా, రాష్ట్రపతిగా రాథా కృష్ణన్ఆపదవులకేఅలంకారమయ్యారు.అప్పటి గ్రీక్ దేశపు అథ్యక్షునికి స్వాగతం చెబుతూ "మీకన్నా ముందే మీదేశం నుండి మా దేశానికికొంతమంది వచ్చారు. కాని భారతదేశంతన హృదయకవాటాలుతెరచిఆహ్వానిస్తున్న గ్రీక్దేశపుఅద్యక్షులు మీరు." అని అలగ్జాండర్గురించి నర్మగర్భంగాచెప్పారు.స్వతంత్ర భారతదేశాన్ని తొలిసారిగా సందర్శించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు "ఐసెన్ హోవర్" ను భారత పార్లమెంట్ సభ్యులకు పరిచయం చేస్తూ, రాథాకృష్ణన్ మాట్లాడిన తీరుకు, ఆయన వాడిన ఆంగ్ల పదసంపదకు అచ్చెరువొంది, ఐసెన్ హోవర్ తానువ్రాసుకొచ్చినఉపన్యాసాన్ని తడబడుతూ చదివాడట.
అటువంటి మహనీయుని జన్మదినాన్నియావద్భారతదేశం ఉపాథ్యాయ దినోత్సవం గా నిర్వహించుకుంటుంది. ఈ సందర్భంగా డా.సర్వేపల్లి రాథాకృష్ణన్ గారికి సహృదయ నివాలి.

0/Post a Comment/Comments