రాష్ట్రపతి ఎన్నిక ప్రజల మనోభావాలను ప్రతిబింభించాలి: - మార్గం కృష్ణ మూర్తి

రాష్ట్రపతి ఎన్నిక ప్రజల మనోభావాలను ప్రతిబింభించాలి: - మార్గం కృష్ణ మూర్తి

ప్రజల మనో భావాలను అత్యున్నతమైన 'రాష్ట్ర పతి' ఎన్నిక ప్రతి బింభిస్తున్నదా ?


ప్రజల మనో భావాలకు అత్యున్నతమైన 'రాష్ట్ర పతి' ఎన్నిక ప్రతిబింభించడం లేదేమోనని    అనిపిస్తుంది . 

సాధారణ ఎన్నికల సమయాలలో, ప్రజలు గత పాలకుల వలన కలిగిన భాధలు, కష్టాలు గుర్తుకు తెచ్చుకొని లేదా నాయకుల వాగ్ధానలను నమ్మి, భావోద్వేగాలకు లోనయి, కొన్ని పార్టీలను తూడ్చి పెడుతారు, మరి  కొన్ని పార్టీలను అందల మెక్కిస్తారు. ఒక సంవత్సరమో, రెండు సంవత్సరాలో గడుస్తే గాని వారి నిజ స్వరూపం బయట పడదు. వారి నిజ స్వరూపం బయట పడేసరికి, వారు ప్రజల కంట్రోల్ లో  లేకుండా పోతున్నారు. ఎన్నికైన  ఏ పార్టీ అయినా  5 సంవత్సరాలు  పాలించాలి. అలాంటి  సమయాల్లో, రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి . అప్పుడు అధికార పార్టీలు       ' విప్పు'  జారీ చేయడం, రాష్ట్ర పతి ఎన్నిక పూర్తి అవడం మొదలైనవీ,  కొన్ని సార్లు, ప్రజల మనో భావాలకు అత్యున్నతమైన రాష్ట్ర పతి ఎన్నిక ప్రతిబింభించడం  లేదేమో నని అని పిస్తుంది 


- మార్గం కృష్ణ మూర్తి

0/Post a Comment/Comments