రాక్షసులే రాజులైతే.... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

రాక్షసులే రాజులైతే.... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్


రాక్షసులే రాజులైతే....

ఆఫ్ఘనిస్తాన్ 
అగ్నిగుండంలా 
మండినంతకాలం
రావణకాష్టంలా రగిలినంతకాలం
ఏ దేశనేతలకూ కంటిమీద కునుకుండదు
ఎవరి బ్రతుకులోను శాంతి సమాధానముండదు

శాంతి కపోతాలు నింగికెగరాలంటే
ప్రజాస్వామ్య పాలన ప్రభవించాలంటే
ప్రజలు స్వేచ్చా వాయువుల్ని పీల్చాలంటే
మానవత్వపు పరిమళాలు వెల్లివిరియాలంటే

రాజ్యకాంక్షతో రెచ్చిపోయే తాలిబాన్ల
దాష్టీకాలను  ‌దౌర్జన్యాలను 
అన్యాయాలను అక్రమాలను 
కర్కషత్వాన్ని‌ కట్టడి చేయాలే
ముస్కర మూకల్ని ముట్టడి చేయాలె
కాబూల్ లోనే వారిని ఖననం చేయాలే
అరచేతిలో అత్యంత శక్తివంతమైన
అణు బాంబులున్న అగ్రరాజ్యాలన్నీ
గుడ్లగూబల్లా గుడ్లప్పగించి చోద్యంచూస్తే ఎలా?

ఆ ఉన్మాదుల
ఆ ఉగ్రవాదుల 
ఆ మూర్ఖుల 
ఆ ముస్కరుల ముప్పు 
అమాయకులైన ఆఫ్ఘాన్లకే పరిమితమా? కాదే !
ఇరుగుపొరుగు దేశాలకు అగ్రరాజ్యాలకు కూడా
కారణం వారు నరరూపరాక్షసులకు ప్రతిరూపాలు !
మనుష్యుల ముసుగులో తిరిగే మానవమృగాలు !

విభజించే విధ్వంసం సృష్టించే
అమెరికా సైనికులు అత్యాధునిక  
ఆయుధాలందించిన యమకింకరులు భయంకరులు
ఔను రాక్షసులకే రాజ్యాధికారం దక్కితే 
ఏపాపమెరుగని అమాయకపు ప్రజలరక్తం 
ఏరులై పారడం తధ్యమే రేపటి రక్తచరిత్రకు శ్రీకారమే

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502P

0/Post a Comment/Comments