కావలసినవి.
బొంబాయి రవ్వ.కప్పు
పంచదార.కప్పు
పాలు.2 కప్స్
యాలకుల పొడి . టీ స్పూన్
కిస్మిస్..జీడిపప్పు
నెయ్యి.తగినంత
మిఠాయి రంగు.చిటికెడు
గోధుమ పిండి. 3కప్పులు
ఉప్పు.చిటికెడు
నూనె. వేయించటనికి సరిపడా
తయా రుచేసే విదా నం..
బాణలి లో నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి వేయించాలి.మందపాటి గిన్నెలో పాలు పోసి అవి మరుగుతుండగా అందులో రవ్వ వేసి బాగా కలపాలి.మద్య మద్య లో నెయ్యి కూడా వేస్తుం డాలి.
రవ్వ ఉ డికిన తర్వాత పంచదార ,మిఠాయి రంగు,యాలకుల పొడి వేసి కలపాలి.విడిగా మరో బాణలి లో కొద్దిగా నెయ్యి వేసి జీడపప్పు,కిస్మిస్ వేయించి కేసరి లో కలపాలి.గోధుమ పిండి లో పాలు పోసి , ఉప్పు వేసి మెత్త గా కలపాలి.ఇపుడు దీన్ని చిన్న వుండలు గా చేసుకుని పూరీ ల్లా వత్తాలి.మద్యలో కేసరి పెట్టీ అంచులు మూసేసి మళ్లీ. పూరీ ల్లా వత్తాలి.ఇపుడు వీటిని నూనె లో వేయించి తీయాలి.
Post a Comment