తుని, శ్రీ చక్క శ్రీరామ్మూర్తి స్మారక పురపాలక ఉన్నత పాఠశాల, బ్యాంక్ కాలనీ నందు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీ ఈరంకి వీర వెంకట సత్య వర ప్రసాద్ గారు తెలుగు సాహిత్యం పై అభిరుచితో పద్య కవిత్వం, వచన కవిత్వం రాస్తూ....
శ్రీ మామిడి రమేష్ గారు రూపొందించిన హరివిల్లు నూతన తెలుగు కవితా ప్రక్రియలో శతాధిక గేయ కవితలు లిఖించినందుకుగాను శ్రీ భద్రాద్రి సాహితీ వేదిక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారు హరివిల్లు కవిమిత్ర పురస్కారం శ్రీ ఈరంకి వారికి వాట్సాప్ ద్వారా అందజేశారు.
అవార్డు గ్రహీత ఈరంకి వర ప్రసాద్ గారికి తోటి ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు శ్రేయోభిలాషులందరూ అభినందనలు తెలియజేశారు.