మే డే ఎందుకు జరుపుతారు

మే డే ఎందుకు జరుపుతారు

: ప్రపంచ కార్మికదినోత్సవం
 చరిత్ర...... మే డే 
  ఎందుకు జరుపుకుంటారు.

మే  డే కార్మికుల పోరాటాలకు,ఐక్యతకు 
   మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం చికాగలో  హై మార్కెట్ లో కార్మికులు చేసిన కనీస పనిగంటలు,విశ్రాంతి గంటలకోస0 జరిపిన పోరాటంలో పోలీస్ కాల్పుల్లో చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినారు.వారు చేసిన త్యాగాల కు రక్తతర్పణం కు ప్రతిఫలంగా మే డే జరుపుకుంటారు. ఈ చైతన్యం ప్రపంచ కార్మికులకు చైతన్య జ్యోతిగా ప్రసారించింది.
1900 నుంచి 1920 వరకు పెట్టుబడి దారి వ్యవస్థ దేశాల లోని విధానాలకు వ్యతిరేకంగా సోషలిస్టు దేశాలు కార్మికులకు మద్దతుగా ఉద్యమాలు చేసినాయి
1886 నుంచి 1890 వరకు కనీస పనిగంటల కోసం కార్మికులు పోరాటం చేసినారు
  నాజీలకు వ్యతిరేకంగా కూడా మే డే ను నిర్వహించే వారు.ఇటలీ,స్పెయిన్ నియంత పాలనలో కూడా కార్మికులు తమ హక్కుల సాధనకు ఉద్యమాలు చేదినారు ఇటలీలో ముస్సోలిని,స్పెయిన్ ఫ్రాంకోలు కార్మికుల ఉద్యమాలను తీవ్రంగా అణిచివేసినారు
      1848 లో మార్కిస్టు సిద్ధాంత కర్త కమ్యూనిస్టు మ్యానిపే స్టో చేత ప్రపంచదేశాల అన్ని ఆకర్షించబడి కార్మికుల ఉద్యమాల కు స్ఫూర్తిగా నిల్చినాయి
ఇక్కడ ఒక వైచిత్రి పూర్తి ఉదారవాద పెట్టుబడి దారి దేశం అమెరికా లోని చికాగో మే డే కు వేదిక అయింది
   ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు స్ఫూర్తి తో కార్మికుల కార్శకుల హక్కులకు స్ఫూర్తిగా నిలిచింది
   .మే డే ఒక రకంగా సంక్షేమ పథకాల రూపకల్పనకు అంకురార్పణ చేస్తే మరో పక్క కనీస వేతనాలు,హక్కులకు ఒక కరదీపికగా తోడ్పడింది.
    1889 ప్యారిస్ లో జరిగిన రెండవ ఇంటర్నేషనల్ సమావేశంలో కనీస పనిగంటలు 8 గంటలు అమలులోకి వచ్చింది
భారత రాజ్యాంగం లో  అదేశిక సూత్రాల లోని సామ్యవాద నియమాలు,ప్రాథమిక హక్కుల 23,24 వ నిబంధనలు కట్టు బానిసత్వం,దోపిడీ,వ్యభిచారం, శ్రమ దోపిడీ నుండి రక్షణ కల్పించడమే కాకుండా 24 వ నిబంధన బాలకార్మిక వ్యవస్థను నిరోధిస్తుంది.మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం,శ్రమికులకు బీమా పథకం,శ్రమికులకు ప్రత్యేక హెల్త్ కార్డులు,ప్రమాద భీమా చట్టాలు అనేక కార్మిక రక్షణాచట్టలు దీని ఉద్దేశమే
కార్మికుల ఒక ఉత్పత్తి శక్తులుగా కాకుండా కార్మికులు గా మాత్రమే గుర్తించవద్దు.యాంత్రికి కర న వల్ల చాలా మంది ఉపాధి కొల్పుతూ భిక్షాటన చేస్తున్నారు.ప్రభుత్వాలు సంస్కరణ ల పేరుతో ప్రభుత్వ అద్వర్యం లోని పరిశ్రమల్లో పెట్టుబడుల ఉప సంహరణ చేస్తూ ప్రవేట్ కు కట్టబెడుతున్నారు.ప్రవేట్ వారు స్కిల్ల్డ్ పేరుతో నైపుణ్యం లేని కార్మికుల ను దూరం చేస్తున్నాయి.
ఒక్క కార్మికుల కె కాదు చదువు కున్న వారు శ్రమదోపిడిలో కొనడగుతున్నారు.
మార్క్స్ చెప్పిన ట్లు  విలువకు మూలం శ్రమ అన్నది సత్యం కానీ అది సత్యదూరం అయ్యింది.కమ్యూనిస్టు సిద్ధాంతాలను వల్లెవేసే కమ్యూనిస్టు పార్టీలు అధికారం లో ఉన్న కార్మికచట్టల అమలు నామమాత్రమే
ప్రయజనాలు ఆశి0చుట తప్పుకాదు శ్రమ దోపిడీ తప్పు
ప్రపంచ కార్మికుల రా ఏకం కండి.. మే డే వర్ధిల్లాలి
వైద్య శేషారావు
లెక్చరర్ ఇన్ సివిక్స్
కామారెడ్డి

0/Post a Comment/Comments