'గుఱ్ఱం జాషువా' సాహితీ పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం

'గుఱ్ఱం జాషువా' సాహితీ పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం

'గుఱ్ఱం జాషువా' సాహితీ పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం
----------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని  హెచ్.మురవణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నను నవయుగ కవి చక్రవర్తి 'గుఱ్ఱం జాషువా' సాహితీ పురస్కారం వరించింది. గుఱ్ఱం జాషువా 127వ జయంతి పురస్కరించుకుని ప్రతి ఏటా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికిచ్చే ఈ అవార్డు బాలసాహిత్యంలో  విశిష్ట సేవలకు  బాలసాహిత్యవేత్త సోమన్న కు  'తెలుగు భాషా వికాస సమితి' , షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయం, గుడివాడ, కృష్ణ జిల్లాలో  సమితి సమన్వయకర్త శ్రీ.డి.ఆర్.బి.ప్రసాద్,పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డా.దివాకర్ ,త్రిభాషా కవి హెచ్.ఆర్.చంద్రం చేతుల మీద అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు
రామకృష్ణ, శంకరరావు,మాధవ రావు,భవానీ,పురప్రముఖులు,గ్రంథాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.అవార్డు గ్రహీత గద్వాల సోమన్నను ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

0/Post a Comment/Comments