జైభీం

జైభీం

*"బాబాసాహేబ్ అంబేడ్కర్ గారు మహపరినిర్వాణ"*
*డిశంబర్ 06, 1956*

*పీడిత ప్రజల హక్కుల ఉద్యమ సూరీడు అస్తమించిన రోజు.*

*డా.బాబాసాహేబ్ అంభేడ్కర్ గారు ప్రపంచంలోని పీడిత ప్రజల హక్కుల కోసం ఉద్యమించిన పోరాట యోదుడు.*

*భారత దేశం వేల ఎండ్లుగా కోనసాగుతున అనాగరిక వ్యవస్తపై అంతర్జాతీయ వేదికలపై గళమెత్తిన మేధావి, కులం మతం పేరుతో మనువాదులు ఈ దేశ మూల నివాసులపై సాగించిన అరాచాకాలు, అణచివేతలపై తిరుగుబాటు చేసిన ఉద్యమ ధీరుడు.*

*అయన జీవిత చరిత్రను చూస్తే ఈ దేశంలో ఎందరో ప్రజల హక్కుల కోసం, ఎన్నో వర్గాల అత్మగౌరవం కోసం నిరంతరం పోరాటం చేసిన గోప్ప మానవతవాది,*
 
*తన జీవితాన్ని పీడిత ప్రజల హక్కుల సాదన కోసం అంకితం చేసి, తన సర్వస్వం కోల్పోయి మనకు హక్కులను సాదించిపెట్టిన త్యాగధనుడు, తను చేసిన పోరాటాల అనుభవంతో ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి,ప్రతి సంస్క్రుతికి, గుర్తింపునిచ్చి సమాన అవకాశాలు రాజ్యాంగంలో కల్పించిన మహోన్నతమైన వ్యక్తి, మహ మేధావి బాబాసాహేబ్ అంభేడ్కర్ గారు.*

*అందరికీ హక్కులు కల్పించిన ఆ మహనీయుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా మన జీవితాల్లో ఎప్పుడూ సూర్యుడులా ఉదయిస్తానే ఉంటాడు*

*డిశంబర్ 06 అంభేడ్కర్ మహపరినిర్వాణ (వర్దంతి) చేందిన రోజు, ఈ రోజు (6.12.22 మంగళవారం)అన్ని చోట్లా,గ్రామాలలో, వాడావాడలా,అంబేడ్కర్ గారి విగ్రహాలు దగ్గర మహనీయుని కి  ఘనంగా నివాళి అర్పిద్దాం.*

 *జై భీమ్*
ఆయన ఆశయాల అమలే నిజమైన నివాళి
ఉమాశేషారావు వైద్య
9440408080

0/Post a Comment/Comments