సంక్రాంతి కథలు

సంక్రాంతి కథలు

సంక్రాంతిపండగయొక్కవిశిష్టత చాటే ఐదు విశేషాలువున్నాయి
సంక్రాంతిపండుగఅనగానేమనకుతెలిసిందిసూర్యుడుమకరరాశిలోకిప్రవేశించేరోజుఅనిచాలామందికితెలుసు.కానీఈపండుగలోఅంతకుమించినప్రత్యేకతలుచాలానేఉన్నాయి.అవేమిటోఒకసారిపరిశీలిద్దాం.పూర్వం సగరుడుఅనేరాజుఉండేవాడు, ఆయనకుఅరవైవేలమందికొడుకులు,వీళ్లంతాఓసారికపిలమునిఆశ్రమంలోకిప్రవేశించి,ఆయన తపస్సుని    భంగం చేశారు. దాంతో  కలపమునివాళ్లందరినీ బూడిదగామార్చేశాడు,ఆబుడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి ఆత్మశాంతించదని చెబుతారు... ఆకాశంలో ఉండే గంగనిఎవరూనేలమీదకితేలేకపోయారు, సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు,ఆయనతపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మనేలమీదఅవతరించిందటసంక్రాంతిగంగిరెద్దులవెనుక కూడా ఓ కథ ఉంది, పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు.శివుడు తన కడుపులోఉండేలాఆగజాసురుడువరాన్నికోరుకున్నాడు
శివునిబయటకురప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు, దేవతలంతా తలాఓవాయిద్యాన్నీపట్టుకుని, నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది! తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు.
అలాఆనాడుశివునిపొందేందుకు చేసిన హడావుడే, ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.
కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది.ఒకసారి శివుడు నందిని పిలిచి…  భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి" అని చెప్పి రమ్మన్నాడు.
కానీ నంది అయోమయంలో…  'రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి' అని చెప్పిందట.దాంతో కోపం వచ్చిన శివుడు, 'ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి,ఆఆహారాన్నిపండించేందుకు నువ్వే సాయపడాలి అని శపించాడు.అప్పటి నుంచి ఎద్దులు, వ్వవసాయంలో సాయపడుతున్నాయట.  కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.
సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా! దీనికి కూడా ఓ కథ చెబుతారు.  సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట, ఇది దేవతలకు పగలు అని నమ్మకం.
దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట, దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.
 సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది.
సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట.
ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు, అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు.భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు.ఇవే ఈ సంక్రాంతి గురించి అయిదు కథలు.ఇంకా గొబ్బెమ్మలుదగ్గరనుంచిభోగిపళ్లవరకు...సంక్రాంతిలోకనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ పాలిటిక్స్

0/Post a Comment/Comments