నేడే గురుపూర్ణిమ

నేడే గురుపూర్ణిమ

నేడు గురుపూర్ణిమ!దాని ప్రాధాన్యతను వివరించిన కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య.
తల్లిదండ్రులు జన్మనిస్తే, దాన్ని సార్థకంచేసేదిగురువులు.విద్యార్థిలో అజ్ఞానమనే చీకట్లనుపార దోలి విజ్ఞానం నింపి జీవితంలో ఉన్నతశిఖరాలుఅధిరోహించేలా తీర్చిదిద్దుతారు గురువులు. 
అందుకే, ఆచార్యులకు అత్యు న్నత స్థానంకల్పించారుపెద్దలు.
ఆషాఢశుద్ధపౌర్ణమిని'వ్యాసపూర్ణిమ'లేదా'గురుపూర్ణిమ'గా జరుపుకుంటున్నాం. ప్రాచీన కాలం నుంచి సమాజాన్ని ధర్మ, జ్ఞాన సంపదలతో నింపిన ఆచార్యులెందరో!   ముఖ్యంగా 'మునీనామ్యహం వ్యాసః' అం టూ,మునుల్లోతానువ్యాసమహర్షిననిభగవద్గీతలోశ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. లోకంలో 'ఏకా యనం' పేరుతో ఒక్కటిగా ఉన్న అనంత వేదరాశినిఋగ్‌,యజు ర్‌, సామ, అధర్వణ వేదాలుగా విభజించివేదవ్యాసుడిగాప్రసిద్ధి చెందాడు కృష్ణద్వైపాయనుడు. 
బదరికాశ్రమంలో దీర్ఘకాలంతప స్సుచేసినందునబాదరాయణుడయ్యాడు.అ చతుర్వదనో బ్రహ్మ, ద్విబాహురపరో హరిః
అఫాలలోచనశ్శంభుః భగవాన్‌ బాదరాయణఃవ్యాసుడు నాలు గు ముఖాలు లేని బ్రహ్మ.రెండు చేతులేఉన్నశ్రీహరి.మూడోనేత్రంలేనిశివుడు.ఈత్రిమూర్తుల కార్యకలాపాలను వ్యాసుడు నిర్వర్తించాడు అని గురుస్తుతి. 
ఆచార్యుడు సృష్టికర్త బ్రహ్మలా విజ్ఞానాన్ని సృజించాడు. పాల న, పోషణ చేసే విష్ణువులా జగ త్తునుదివ్యగుణాలతోనడిపించాడు.లయకారుడైనశివుడిలా కల్మషాలను, సంకుచిత భావా లను నశింపజేశాడు. అందుకే వ్యాసుడుత్రిమూర్తిస్వరూపుడు.వ్యాసుడేమూలంఇంటిగుమ్మంలోపెట్టినదీపంలోపలా,బయటా కాంతిని ప్రసరింపజేస్తుంది (గేహళీదీపన్యాయం). అలాగే వ్యాసుడు తనకు ముందున్న గురువులు, తన కాలంనాటి గు రువులు, తనతరవాతిగురువు లకుతనలోనిదైవశక్తితోస్ఫూర్తినిస్తున్నాడు. మన ప్రాచీనవిజ్ఞా నమంతావ్యాసునినుంచేవెలువడింది. అందుకే'వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం' అన్నారు.వ్యాసుని ముఖకమలంనుంచిజాలువారిన జ్ఞానామృతాన్ని జగత్తంతా ఆస్వాదిస్తోంది.విద్యార్థిలోనిద్రా ణమైఉన్నశక్తులనుమేల్కొలిపి, జ్ఞానం, ఆనందాన్ని నింపేది గురువులే. 'ఆచార్య దేవో భవ' అని వేదం ఉపదేశించింది. దా చి ఉంచిన ధనాన్ని గురించి ఒక వ్యక్తిఅవసానదశలోఆత్మీయు-లకుతెలియజేసేవిధంగాఆచార్యుడుపెద్దలనుంచితెలుసుకున్నజ్ఞానాన్నిశిష్యులకుఉపదేశిస్తాడు. 'ఆచార్య స్తుతే గతిం వక్తా' అంటూ, ఆచార్యుడే శిష్యుడికి మోక్షమార్గాన్ని తెలుపుతాడనిఛాందోగ్యోపనిషత్తు కీర్తిస్తోంది.ఆ తలంపు వద్దు
ఆచార్యఃసహరిఃసాక్షాత్‌చరరూపీ న సంశయఃమగ్నానుద్ధరతే లోకాన్‌కారుణ్యాత్‌శాస్త్రపాణినఆచార్యుడుప్రత్యక్షనారాయణుడే! సంసార సాగరంలో ము నిగి ఉన్న వారినిశాస్త్రమనేచేతి తోఉద్ధరిస్తాడు.మంత్రం,మంత్రాన్ని ఇచ్చే గురువు, మంత్రాన్ని ప్రతిపాదించేదైవంఅనుగ్రహానికి పాత్రులైనవాళ్లు దుఃఖం బారిన పడరని, మోక్షం పొందుతారని పెద్దలుచెబుతారు.అందుబాటులో ఉన్న గురువుని వదిలిపెట్టి భగవంతుని ఆశ్రయించటం చేతిలో ఉన్న నీటిని పారబోసి, వర్షం కోసం ఎదురుచూడటం లాంటిదనినానుడి.విష్ణోరర్చావతారేషు లోహభావం కరోతి యఃయో గురౌ మానుషభావం ఉభౌ నరకపాతినౌఆరాధించే విగ్రహాల్ని కేవలం లోహంతో తయారుచేసినవని,గురువులను తనలాంటి సాధారణ మను షులని తలచేవ్యక్తులునరకాన్ని పొందుతారనిబ్రహ్మాండపురాణం చెబుతోంది. ఏ లోహంతో తయారుచేసినవైనావిగ్రహాలను భగవత్‌ స్వరూపంగానే భావిస్తూ అర్చించాలి. శారీరక లోపాలు, కులమతాది లౌకిక విషయాలు, గుణగణాలను గణించకుండా గురువుల పట్ల భక్తిశ్రద్ధలతో మెలగాలి.వారివిధే యత ఆదర్శంలోకమంతా ఆరాధించే శ్రీకృష్ణుడు కూడా గురువును ఆశ్రయించి శిష్యరి కం చేశాడు. 'పుట్టింది మొదలు ఆలమందలతో తిరుగుతూపెరి గాం. ఇప్పటికైనా ఒక మంచి గురువు వద్ద విద్యాభ్యాసం చేయాలి' అనుకున్న శ్రీకృష్ణ బలరాములు అవంతిపురంలో 'సాందీపుని' వద్దకు వెళ్లితమకు విద్యాబుద్ధులు నేర్పాలని ప్రార్థించారు. అందుకు అంగీక రించిన గురువు వారికి సమస్త విద్యలూ     నేర్పించాడు. వారి ద్దరూ వేదవేదాంగాలను కేవలం అరవైనాలుగు రోజుల్లో, ధర్మ, తర్క,న్యాయ,గణిత,చిత్రలేఖన,అశ్వ,గజశాస్త్రాలనుపన్నెండు వారాల్లో అభ్యసించారు. అస్త్రవిద్యను యాభై రోజుల్లో సొంతం చేసుకున్న మీదట గురువుకి భక్తిపూర్వకంగా పాదాభివందనంచేశారు.గురువులతో సమానం!యేనైవ గురుణా యస్య న్యాసవిద్యా ప్రదీయతే।తస్య వైకుంఠ దుగ్ధాబ్ధిః ద్వారకా స్సర్వ ఏవ సః।।వేంకటాద్రి మొదలుకొని ద్వారక వంటి సమస్త తీర్థ క్షేత్రాలు జ్ఞానమనే చూపును ఇచ్చి అజ్ఞానమనే చీకటిని పారదోలతాయి. కాబట్టి ఆ దివ్య ప్రదేశాలు కూడా రక్షించే గురువులతో సమానమే. ఆయా పుణ్యక్షేత్రాల విషయంలో ఎలా భక్తిభావంతో ఉంటామో, గురువుల విషయంలో కూడా అలాగే మెలగాలని దీని అంతరార్థం.
నిర్లక్ష్యం పెను శాపం
నారాయణోపి వికృతిం యాతి గురోః ప్రచ్యుతస్య దుర్బుద్ధేః
కమలం జలాదపేతం శోషయతి, రవి ర్న పోషయతి
సహజంగాసూర్యుడుతామరపువ్వును వికసింపజేస్తాడు. ఆ పువ్వు నీటిలో ఉన్నంతవరకే ఆ వికాసం. అదే పువ్వు నీటిని వదలినేలపైకివచ్చినమరుక్షణమే దాన్ని అదే సూర్యుడు మాడ్చి, నశింపజేస్తాడు.అలాగే గురువు విషయంలో కూడాభక్తి తో ఉంటూ, ఆయన బోధలను శ్రద్ధతో అనుసరించే వారినిశ్రీమ న్నారాయణుడురక్షించిఉన్నతిని కల్పిస్తాడు. గురు బోధలను పెడచెవిన పెట్టి, ఆయన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిని నారాయణుడు శిక్షిస్తాడన్నది ఈ శ్లోక భావం.ధన్యులమైతిమి మీ కృపమాన్యగుణోదార!నీవు మమునొకయర్థంబన్యూనంబుగ నడుగుమనన్యసులభమైన దెద్దియైననువేడ్కన్‌మాన్యుడా! ఉదారుడా!నీదయవల్లమేము ధన్యులంఅయ్యాం.కృతజ్ఞతగా గురుదక్షిణఇవ్వాలనుకుంటున్నాం.ఇతరులకుసులభంకానిది ఏదైనా అడగండి' అన్నారు బలరామకృష్ణులుహరివంశంలో. గురువు పట్ల వారి విధేయత అందరికీ ఆదర్శం.
గురువే దైవం
గురురేవ పరంబ్రహ్మ, గురురేవ పరాగతిఃగురురేవ పరావిద్యా, గురురేవ పరంధనమ్‌
గురురేవ పరఃకామో గురురేవ పరాయణమ్‌యస్మాత్తదుపదేష్టాసౌ తస్మాద్గురుతరోగురుః
సకల విద్యలను ఉపదేశించే గురువే దైవం. గురువే ఆశ్రయింపదగినవాడు. గురువే ఉత్తమ విద్య. గురువే శ్రేష్ఠమైన ధనం- అని శాస్త్రం చెబుతోంది. ప్రతిభాసంపన్నమైన గురువు సన్నిధిలో జ్ఞాన దీపాలుగా వెలగడమేప్రతిఒక్కరిలక్ష్యమూ కావాలి.
.

0/Post a Comment/Comments